google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 సీఐ హేమ సుందర్ రావు ను సత్కరించిన దళిత. గిరిజన జెఎసి హ్యూమన్ సభ్యులు.

సీఐ హేమ సుందర్ రావు ను సత్కరించిన దళిత. గిరిజన జెఎసి హ్యూమన్ సభ్యులు.

వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల మండలంలో ని కస్తూరిబా గాంధీ బాలికల కళాశాలను శనివారం పోరుమామిళ్ల సిఐ హేమ సుందర్ రావు సందర్శించారు. అనంతరం ఆయన విద్యార్థినిలను ఉద్దేశించి మాట్లాడుతూ సైబర్ భద్రత, బాల్య వివాహాల నివారణ  ట్రాఫిక్ పై వారికి అవగాహన కల్పించారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశాలపై ఆయన వివరించారు
అదేవిధంగా వ్యక్తిత్వ వికాసం పై అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని ఆయన తెలిపారు.  లైంగిక వేధింపుల వంటి  సమస్యలు వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, మరియు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments