తమిళనాడుకు గంజాయి తరలింపులో పోలీసులకు పట్టుబడిన ఘటన పట్ల జనసేన పార్టీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

తాజాగా ఒక వ్యక్తి, జనసేన పార్టీకి చెందిన కార్యకర్తగా గుర్తించబడినవాడు, తమిళనాడు పోలీసులచే గంజాయి తరలింపులో పట్టుబడిన ఘటన పట్ల జనసేన పార్టీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుందన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కుప్పం నియోజకవర్గము జనసేన పార్టీ ఇన్చార్జి సురేష్ మాట్లాడుతూ 
జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులను సహించరు. జనసేన పార్టీ నైతిక విలువలు, క్రమశిక్షణ, చట్టపరమైన గౌరవం విషయంలో ఎప్పుడూ రాజీ పడదు. అందువల్ల, ఆ వ్యక్తిని ఇకపై పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్ననీయం  అన్నారు. పార్టీకి సంబంధించిన ఏ విధమైన కార్యక్రమాలలోనూ అతనికి స్థానం లేదు.జనసేన పార్టీ తరఫున స్పష్టంగా తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన వ్యక్తులు పార్టీ కింద కొనసాగలేరు. పార్టీ పూర్తిగా ప్రజాసేవ, శుద్ధమైన రాజకీయాలకు అంకితమై ఉంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాము.కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments