ఆంధ్రప్రదేశ్. ప్రకాశం జిల్లా. కంభం మండలంలోని కంభం చెరువును ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ సందర్శించారు. చెరువుల
సందర్శించి చెరువు ప్రకృతి అందాలను ఆయన అభివర్ణించారు. చెరువును చూస్తే తనకు ఎంతో ఆనందంగా ఉందని కంభం చెరువును మంచి పర్యాటక ప్రదేశంగా రూ.35 కోట్ల వరకు ఖర్చు చేసి తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. అవసరమైతే ఇంకా అదనంగా ఖర్చు చేస్తామని చైర్మన్ బాలాజీ తెలిపారు. చెరువులో బోటింగ్, చెరువు ప్రాంతంలో ఓ రిసార్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇంత అందమైన సుందరమైన చెరువు ఉండడం తనకెంతో ఆనందంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో మరియు స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తో కలిసి ఈ ప్రాంతాన్ని పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అన్నారు...
0 Comments