న్యూస్ 21 తెలుగు ఛానల్: పోరుమామిళ్ల మండల జనసేన పార్టీ అధ్యక్షుడు శీలంశెట్టి లక్ష్మయ్య ఆధ్వర్యంలో కువైట్ దేశంలోని కైతాన్ ప్రాంతంలో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ సంక్రాంతి సంబరాలు ప్రవాస భారతీయులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలుగు ప్రజలంతా ఆనందం. ఆరోగ్యం. అభివృద్ధితో నిండిన జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
0 Comments