పంట నష్టాలపై రైతులతో చర్చించిన డిసిసి చైర్మన్ మంచురి నారాయణరెడ్డి...
పంట నష్టాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తాను...
నష్టపరిహారం అందేలా తమ వంతు కృషి చేస్తాను...
వైయస్సార్ కడప జిల్లా డిసిసి బ్యాంకు చైర్మన్ మంచురి సూర్యనారాయణ రెడ్డి...🥰
న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా. బద్వేలు నియోజకవర్గంలోని కాశినాయన మండలంలో రెండు రోజుల క్రితం ఈదులు గాలుల తో కురిసిన అకాల వర్షం వల్ల అరటి పంటలు దెబ్బ తిన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం వైయస్సార్ కడప జిల్లా డిసిసి చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి కాశినాయన మండలం లోని సావిశెట్టిపల్లె గ్రామాన్ని సందర్శించి దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించి. బాధిత రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే ఉద్యాన శాఖ మరియు వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఇటుకలపాడు సహా సమీప గ్రామాల్లో కూడా పంట నష్టం జరిగినట్లు స్థానికులు తెలియజేయగా, ఆ విషయాన్ని ఉమ్మడి కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ గమనించారు. ఈ మూడు మండలాల్లో సుమారు 3 వేల ఎకరాల్లో అరటి సాగు జరుగుతుందని, ఇది రైతుల ప్రధాన ఆదాయ వనరుగా ఉందని తెలిపారు.ఈ ప్రాంతంలో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తే రైతులకు మరింత ఉపయోగంగా ఉంటుందని దాని ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలుస్తుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దేవినేని వెంకటసుబ్బారెడ్డి, మురుగు సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, గజ్జల గోపిరెడ్డి, బూసి రామ సుబ్బారెడ్డి, నాగిరెడ్డి, అంకాల రెడ్డి, శ్రీనివాసులు నందమూరి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సూర్య నారాయణ రెడ్డి, దుర్గారావు, విజయ భాస్కర్ రెడ్డి, బాలయ్య రామకృష్ణయ్య, రామకృష్ణయ్య, అడవి రాముడు కృష్ణ, కృష్ణ, వెంకటేష్, నాగ సుబ్బారెడ్డి, రాము, మంత్రి రెడ్డి తదితరులు.అలాగే బద్వేలు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నాయకులు డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్, చెరుకూరి రవికుమార్,అరవశ్రీనివాసులురెడ్డి,చెండ్రాయుడు, చిన్న వెంకట సుబ్బయ్య,బాదిరెడ్డి వీరా రెడ్డి, ఆర్యవైశ్య స్టేట్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య,అశోక్ కుమార్ రాజు,ప్రహ్లాద్ రెడ్డి,పామూరి బాలి రెడ్డి, కల్లూరి దుగ్గిరెడ్డి,మాచుపల్లి కృష్ణారెడ్డి,సిమెంట్ వెంకట సుబ్బారెడ్డి,బిజీవేముల చంద్ర శేఖర్ రెడ్డి,గురుప్రసాద్ రెడ్డి,నవీన్ కుమార్ రెడ్డి, బ్రహ్మదండ,శ్రీనివాసులు,కోటపాటి పెంచలయ్య, అందూరు వెంకట సుబ్బా రెడ్డి, పురుగూటి నాగ సుబ్బారెడ్డి, మంత్రి రెడ్డి సుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి ఇటుకలపాడు రామచంద్రయ్య, నల్లమల్ల చంద్రశేఖర్ రెడ్డి,వడమాను శ్రీనివాసులు రెడ్డి, వడ్డమను శ్రీనివాసులురెడ్డి, శ్రీరాములు, జక్కుల పవన్,తదితర తెలుగుదేశం పార్టీ సావిశెట్టిపల్లి, ఇటుకుల పాడు, ఆకుల నారాయణపల్లి గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
0 Comments