న్యూస్ 21 తెలుగు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత సులభంగా, వేగంగా, సమర్ధవంతంగా సేవలు అందించాలనే లక్ష్యంతో గ్రామం లోని రెవెన్యూ సమస్యలను సమర్ధవంతంగా గరిష్టంగా "ఒక నెల - 3 గ్రామాలు - 4 సందర్శనలు" కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలియజేసింది. ఈ కార్యక్రమం ద్వారా అందరు రెవెన్యూ అధికారులు, తహశీల్దార్ నుండి వి.ఆర్. ఎ వరకు సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యముతో మొత్తం రోజంతా అన్ని రకాల రెవెన్యూ రికార్డులతో గ్రామస్థాయిలోనే ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, వాటికి నిర్ణీత కాలవ్యవధిలో సమర్ధవంతంగా పరిష్కారం దిశగా చర్యలు తీసుకోనున్నారు.
ముఖ్యంగా గ్రామం లోని రెవెన్యూ సమస్యలు అనగా, ఆర్ఆర్, వెబ్యాండ్, సరిహద్దు వివాదాలు, దారి వివాదాలు, సదాబైనామా క్లెయిమ్లు, నామమాత్రపు ఖాతాను సాధారణ ఖాతాగా మార్చడం, ఎల్పిఎమ్లలో పాత సర్వే నంబర్ల తప్పుడు అనుసంధానం, కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు, భూ ఆక్రమణలు మరియు ఇతర రెవెన్యూ సంబంధిత సమస్యలకు సంబంధించి పెద్ద సంఖ్యలో పిటిషన్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ఎస్) ద్వారా అందుతున్నట్లు గమనించబడింది.
పరిష్కారంలో జాప్యం, సరైన క్షేత్రస్థాయి ధృవీకరణ లేకపోవడం, మరియు క్షేత్రస్థాయి అధికారుల మధ్య సమన్వయం కొరవడటం వల్ల పైన కనబరిచిన ఫిర్యాదులలో చాలా వరకు పదేపదే సమర్పించబడుతున్నాయి.
క్షేత్రస్థాయిలో ఫిర్యాదుల పరిష్కారాన్ని మరింత బలోపేతం చేయడానికి మరియు నాణ్యమైన పరిష్కారాన్ని నిర్ధారించడానికి, జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో "ఒక నెల 3 గ్రామలు నాలుగు పర్యటనలు" అనే పేరుతో ఒక వ్యవస్థీకృత గ్రామ స్థాయి కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రతిపాదించబడింది.
ఇటీవలి కాలంలో, రెవెన్యూ శాఖ అనేక సంస్కరణాత్మక చర్యలు చేపట్టింది, ఫలితంగా ప్రజా సంతృప్తి మెరుగుపడింది.
ఈ కార్యక్రమంలో భాగంగా క్రింది అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలి:
తహశీల్దార్,
మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్
మండల సర్వేయర్
M.P.D.O
PR, నీటిపారుదల మరియు ఇతర సంబంధిత శాఖల AE/AEE
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (అటవీ సరిహద్దు వివాదాలు / ROFR సమస్యలు ఉన్నచోట)
దేవాలయ శాఖ ప్రతినిధి (దేవాలయ భూములు ఉన్నచోట)
నాలుగు సందర్శనల నిర్వహణ:
1. మొదటి సందర్శన : ఫిర్యాదుల గుర్తింపు మరియు స్వీకరణ
2. రెండవ సందర్శన : ఫిర్యాదుల ధృవీకరణ, పరిష్కారం
3. మూడవ సందర్శన : ఫిర్యాదుల విచారణ మరియు తీర్మాణం
4. నాలుగవ సందర్శన : ఫిర్యాదుల ముగింపు, ప్రజల నుండి అభిప్రాయ సేకరణ
నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ప్రతి నెలలో మూడు గ్రామాలను సందర్శించి, మొత్తం నాలుగు విడతలగా పర్యటనలు నిర్వహిస్తారు. గ్రామాల్లోని ప్రజలతో నేరుగా సంప్రదించి, వారి సమస్యలు, అభ్యర్ధనలు, అవసరాలను నమోదు చేసి, తగిన చర్యలు తీసుకుంటారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
0 Comments